అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలో గ్రామాలలో పారిశుధ్య పనులు చేపట్టకపోతే చర్యలు తప్పవని డిడిఓ అమర్నాథరెడ్డి హెచ్చరించారు. బృందావనంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో నీరు నిల్వ లేకుండా దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాలలో పారిశుధ్య పనులు చేపట్టకపోతే చర్యలు తప్పని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్ రావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.