ఒంగోలు మండలం ఎర్రజర్ల గ్రామానికి చెందిన రైతు కుటుంబం ప్రాణహాని ఉందంటూ కలెక్టర్ రాజాబాబుకు ఈ వినతిపత్రం
Ongole Urban, Prakasam | May 11, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎరజర్ల గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు కుటుంబం తమకు ప్రాణహాని ఉందంటూ కలెక్టర్ రాజాబాబును ఆశ్రయించారు. తమ పొలాన్ని తక్కువ ధరకే పొందాలని కొందరు వ్యక్తులు తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ప్రజా సమస్యల పరిష్కారమేదిక మీకోసం కార్యక్రమంలో రైతు కుటుంబం వినతి పత్రం సమర్పించింది. కలెక్టర్ రాజాబాబు విచారణ జరిపి న్యాయం చేస్తామని రైతు కుటుంబానికి హామీ ఇచ్చారు.