ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి చెందిన పద్మ అనే మహిళా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో రూ.1000 పెట్టి బీమా చేయించుకున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పద్మ ప్రమాద బీమా చేయించుకోవడంతో వారి కుటుంబ సభ్యులకు కందుకూరు రీజినల్ మేనేజర్ అప్పలరాజు రూ.20 లక్షల చెక్కును మృతురాలి సోదరుడు చంద్రశేఖర్ కు అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ప్రమాద బీమా చేయించుకోవడం వల్ల కలుగు ప్రయోజనాలు అప్పలరాజు తెలిపారు.