రాష్ట్ర గవర్నర్ పర్యటన నేపథ్యంలో నగరంలోని జేఎన్టీయూలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆనంద్,జిల్లాఎస్పీజగదీష్
Anantapur Urban, Anantapur | Apr 4, 2026
ఈనెల 6వతేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో నగరంలోని జేఎన్టీయూలో అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధత అధికారులను ఆదేశించారు. ఈనెల 6వతేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జేఎన్టీయూలో నిర్వహించే స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి రానున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జేఎన్టీయూలో సంబంధిత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా ఎస్పీ పి.జగదీష్, తదితరులు పరిశీలించారు.