ఒంగోలు అర్బన్: ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించి రైతుల వద్ద ఉన్న పొగాకును మద్దతు ధరకు కొనుగోలు చేయాలి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
Ongole Urban, Prakasam | Jun 19, 2026
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే పొగాకు రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం దారుణమని సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే 1000 కోట్లను కేటాయించి మద్దతు ధరతో రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గడిచిన రెండు నెలలుగా ప్రభుత్వానికి పలు రకాలుగా రైతులను ఆదుకోవాలని చెప్తున్నామని దాని పట్ల సరైన దృక్పథంతో ఆదుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పొగాకు రైతులను ఆదుకోకపోతే త్వరలోనే విజయవాడ కేంద్రంగా భారీ ధర్నాలు చేపడతామని హెచ్చరించారు