అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో స్వయంభువుగా వెలసి భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు బుధవారం అట్టహాసంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి కల్యాణం కమణీయంగా సంప్రదాయబద్దంగా జరిపారు. అనంతరం సుబ్రహ్మణ్య గాయత్రీ హవనము, సుదర్శన హోమం, పూర్ణాహుతి తదితర పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్ కుమార్, అర్చకులు దివాకరశర్మ, నాగరాజు శర్మ, వేదమూర్తి, ఇతర అర్చక బృందం, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.