మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న మూలం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారు బైక్ ఒకదానికోటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదే సమయంలో వెనక వస్తున్న మరో కారు ముందున్న కారును ఢీ కొట్టింది. దీంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది పోలీసులు సమయానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.