వ్యవసాయానికి పగలుపూట 9 గంటల విద్యుత్ : కోవెలకుంట్ల ట్రాన్స్కో AE రామమోహన్
కోవెలకుంట్ల మండల పరిధిలోని వివిధ సబ్ స్టేషన్లలో వ్యవసాయ రంగానికి పగలు 9 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏఈ రామమోహన్ తెలిపారు. కొప్పర్ల, అమడాల, కలుగొట్ల, హరివరం వంటి పలు గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ అందుబాటులో ఉంటుంది. రైతులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.