అనంతపురం జిల్లా మనీలా గ్రామం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 12, 2026
అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న మనీలా గ్రామం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని మంగళవారం ఉదయం పోలీసులు వివరాలను వెల్లడించారు. అతనికి తీవ్ర గాయాలవ్వడంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం స్థానికులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.