కుప్పం పట్టుగుళ్ళ మార్కెట్ లో ఆ శాఖ అధికారులతో ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు మంగళవారం సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న 5,238 ఎకరాలను 1,063 షెడ్డులను మరింత పెంచి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం మార్కెట్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ శరవణ, డైరెక్టర్లు తులసి, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.