గుత్తి అమృత్ సినిమా థియేటర్ లో చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం రాత్రి చిరంజీవి ఫ్యాన్స్ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పాటిల్ సురేష్, బ్రహ్మయ్య, నాగప్ప, సత్య ల ఆధ్వర్యంలో అభిమానులు సంబరాలు చేశారు. జై చిరంజీవ, జై జై చిరంజీవ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. కేరింతలు కొట్టారు.