నంద్యాల అర్బన్: గాజుల పల్లెలో జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు: మహానందిఎస్సై రామ్మోహన్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Jun 28, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో జరుగుతున్న జాతర సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈ జాతరకు నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 60 మంది సిబ్బందితో రాత్రంతా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన తెలిపారు.