ముమ్మిడివరం లోని జిల్లా సివిల్ సప్లై కార్యాలయం వద్ద మాల మహానాడు నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులలో అంబేద్కర్ కోనసీమ జిల్లా బదులు తూర్పుగోదావరి జిల్లా అని పేరు ముద్రించడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ కార్డుల్లో అంబేద్కర్ కోనసీమ అని మార్పు చేసిన తరువాత కార్డులు పంపిణీ చేయాలని కోరారు