సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తగరుకుంట గ్రామంలో ఎస్సీ కాలనీవాసులు మంగళవారం నాలుగు గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసి సన్మానం చేసి తమ సమస్య పరిష్కరించినందుకు ఎమ్మెల్యే పరిటాల సునీతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా 11 కెవి విద్యుత్ లైన్ వల్ల వర్షం వచ్చిన ప్రతిసారి గోడలకు విద్యుత్ ప్రచారం అయ్యి షాక్ తగులుతున్న సందర్భంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటనకు వచ్చినప్పుడు ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా 6 లక్షల 75 వేల రూపాయలతో అక్కడున్న విద్యుత్ లైన్ ను మార్చడం జరిగిందని తగరకుంట ఎస్సీ కాలనీ వాసులు పేర్కొన్నారు.