ఏప్రిల్ 14 వాక్ ఫర్ ఈక్వాలిటీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం : ఫోర్స్ అధ్యక్షులు ch సుధీర్ బాబు
Ongole Urban, Prakasam | Apr 11, 2026
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహణ కొరకు శనివారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ భవనం నందు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ రిలయబుల్ క్యాపబుల్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుధీర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు కలసి ఏప్రిల్ 14 ఉదయం ఏడు గంటలకు స్థానిక అంబేద్కర్ భవనం నుండి వాక్ ఫర్ ఈక్వాలిటీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు.