కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డులో ఉన్న 12వ శివాలయాన్ని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ కఫార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ సూచించారు. ఈ సందర్భంగా కొందరు అర్హత ఉండి తమకు పెన్షన్లు మంజూరు కాలేదని మున్సిపల్ చైర్మన్ కు ఫిర్యాదు చేయగా... ఆయన స్పందిస్తూ ప్రభుత్వం జీవో ద్వారా నూతన పెన్షన్లు మంజూరు చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే నూతన పెన్షన్లు అర్హులందరికీ అందుతాయని అన్నారు.