నంద్యాల అర్బన్: ఇల్లూరు కొత్తపేటలో రూ. 1.21 కోట్లతో రహదారులు డ్రైనేజీ పనులు ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Apr 19, 2026
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం ప్రారంభించారు. రూ.1.21 కోట్లతో సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ పనులు గ్రామ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి ముచ్చటించారు.