డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి సూచించారు. మండల పరిధిలోని గున్గల్ మోడల్ స్కూల్లో రాచకొండ CP ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. విద్యార్థులు యువత డ్రగ్స్ కక్కు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.