జిల్లా ప్రజల్లో భద్రత, చట్టపరమైన అవగాహన పెంపుదలకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా గ్రామాల వరకు చేరువైంది. అధికారులు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ నేర నియంత్రణ, ప్రజల రక్షణ, సైబర్ భద్రత, రోడ్డు భద్రత వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా పోలీసులు ‘డిజిటల్ అరెస్ట్’, ఫోన్ మోసాలు, మోసపూరిత లోన్ యాప్లు వంటి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్, లింక్స్ కారణంగా అనేక మోసాలు జరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.