గుంతకల్లు: గుత్తి మండలం ఇసురాళ్లపల్లి గ్రామంలో అనారోగ్యసమస్యలతో మహిళ ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఇసురాళ్లపల్లి గ్రామంలో సావిత్రి అనే మహిళ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సావిత్రి గత కొన్ని నెలలుగా కుటుంబసమస్యలతో పాటుగా అనారోగ్యసమస్యలతో బాధ పడుతుండేది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.