డోన్: డోన్ లో అల్లు అర్జున్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Dhone, Nandyal | Apr 8, 2026 నంద్యాల జిల్లా డోన్లో అల్లు అర్జున్ అభిమానుల ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా హాజరయ్యారు. రక్తదానం ప్రాణదాతతో సమానమని, చిన్నారుల ప్రాణాలను రక్షించేందుకు యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. అల్లు అర్జున్ అభిమానులు, యువత పాల్గొని రక్తదానం చేశారు