హయత్నగర్ కోర్టులో ఈ నెల 15న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు CI నాగరాజు గౌడ్ తెలిపారు. CI మాట్లాడుతూ.. చిన్న గొడవలు, కుటుంబ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు వంటి వివాదాలను రాజీ పద్ధతిలో పరిష్కరించుకునేందుకు ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు కోర్టు కానిస్టేబుల్ సుధాకర్రెడ్డి లేదా CIని సంప్రదించాలని సూచించారు. ప్రజలు ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని CI విజ్ఞప్తి చేశారు.