కేశంపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ కమిటీ సభ్యుడు శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.