అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో పంపిణీ చేస్తున్న సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీని రైతులు సద్వినియోగం చేసుకోండని మండల ఏ ఓ పృథ్వి సాగర్ సోమవారం పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున మాజీ ఎంపీటీసీ కెంచిరాముడు, విశ్రాంత ఉపాధ్యాయులు ఈశ్వరప్ప నాగరాజులతో కలిసి రైతులకు సబ్సిడీ విత్తన వేరుశనగను ఏవో పంపిణీ చేశారు. మండలంలో బోరుబావుల రైతాంగం రభీ విత్తనసాగు రైతులు సబ్సిడీ పోను రైతులు రు. 5520 చొప్పున క్వింటాకు చెల్లించాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.