హుజూర్ నగర్: చింతలపాలెంలో కృష్ణా నదిలో పడి మహిళ గల్లంతు
చింతలపాలెం మండలం చింత్రియాలకి చెందిన బడుగుల సైదమ్మ (54) కృష్ణా నదిలో గల్లంతైంది. గేదెలు మేపడానికి బల్లకట్టు సమీపానికి వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. సాయంత్రం వరకు ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నది ఒడ్డుకు వెళ్లి చూడగా, ఆమె చెప్పులు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా, గాలింపు చర్యలు చేపట్టారు.