కలెక్టరేట్లో వృద్ధుల సంక్షేమం కోసం 'సీనియర్ సాథి' కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. పిల్లలు, వృద్ధులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోతే జీతాల నుంచి కట్ చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు అండగా ఉండి, చట్టాన్ని సీరియస్ గా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.