పెద్ద కడబూరు:కార్మికుల హక్కుల సాధన కోసం సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. జనవరి 4న విశాఖపట్నంలో జరగనున్నాయి. శుక్రవారం పెద్ద కడబూరు ఎమ్మార్వో కార్యాలయం ముందు నాయకులు తిక్కన్న, ఈరన్న గోడ పత్రికలను విడుదల చేశారు.మహాసభలకు భారీగా ప్రజలు హాజరు కావాలని కోరారు. కొత్త లేబర్ కోడ్ల రద్దు, సమాన పనికి సమాన వేతనం, బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు పునరుద్ధరణ వంటి డిమాండ్లను లేవనెత్తారు.