ఒంగోలు అర్బన్: ప్రజలు నుండి అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | May 4, 2026
ప్రజలు నుండి అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, వారికి సంతృప్తి కలిగే విధంగా నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపాలని, జిల్లా కలెక్టర్ రాజాబాబు, అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇంచార్జి జిల్లా రెవెన్యు అధికారి మాధురి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి, డిపిఓ వెంకటేశ్వర రావు లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.