చంద్రశేఖరపురం: ఇటీవల చీమకుర్తి మండలం బండ్లమూడి లో దళితులైన మాదిగలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ కనిగిరి నియోజకవర్గ ఉపాధ్యక్షులు బలబద్ర శ్రీను మాదిగ డిమాండ్ చేశారు. చంద్రశేఖరపురంలో ఆదివారం ఆయన పర్యటించి, ఇటీవల దళితులపై జరుగుతున్న దాడులను స్థానికులకు వివరించారు. బండ్లమూడి లో జరిగిన దాడి విషయంపై స్థానికులతో శ్రీను మాదిగ మాట్లాడుతూ.... బండ్లమూడి లో మాదిగలకు న్యాయం చేయకుంటే ఈ నెల 26వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.