కనిగిరి మండలంలోని బల్లిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ట్రిపుల్ ఐటి కళాశాల స్థలాన్ని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ వైస్ ఛాన్స్లర్ మధుమూర్తి తో కలిసి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కుఉగ్ర నర్సింహారెడ్డి బుధవారం పరిశీలించారు.బల్లిపల్లిలో ట్రిపుల్ ఐటి కళాశాల కోసం కేటాయించిన స్థలానికి సంబంధించిన వివరాలను వైస్ ఛాన్స్లర్ కు ఎమ్మెల్యే వివరించారు. కళాశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవడంతో పాటు భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని వైస్ ఛాన్స్లర్ ను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కోరారు.