ఎమ్మిగనూరు: పెంచలయ్యను హతమార్చిన గంజాయి ముఠాను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం నాయకులు డిమాండ్
డీవైఎఫ్ఎ నెల్లూరు నగర యువ నాయకుడు పెంచలయ్యను హతమార్చిన గంజాయి ముఠాను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్, ప్రధాన కూడలిలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీపీఎం పట్టణ నాయకుడు సురేశ్, కార్య దర్శి గోవిందు మాట్లాడుతూ.. పెంచలయ్యను హతమార్చిన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. గంజాయి ముఠా ఆగడాలను నియంత్రించాలన్నారు.