ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దంతాలపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు శారద అనే దంపతులు అప్పుల బాధతో ఐదు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయి గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు నెలల క్రితం వీరు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన శుక్రవారం స్థానికంగా ఉన్న పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సురేష్ తెలిపారు. మృతదేహాలు పూర్తిగా కూలిపోయి ఎముకలు మిగిలాయి.