ఒంగోలులో నిర్వహించిన పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 61 అర్జీలు.
Ongole Urban, Prakasam | Apr 20, 2026
ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సోమవారం ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో “మీకోసం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులతో జిల్లా ఎస్పీ మరియు పోలీసు అధికారులు ఫిర్యాదిదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత మరియు ఆన్లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదిదారులు స్వేచ్ఛగా వినిపించారు. జిల్లా ఎస్పీ ఫిర్యాదులను సవివరంగా పరిశీలించి, తగిన న్యాయం చేస్తామని భరోసా కల్పించారు