గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని శంషాబాద్ అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ అన్నారు. షాద్నగర్ పట్టణంలో రేపు జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోలీస్ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఉదయం ఎన్నికల ప్రారంభం నుంచి సాయంత్రం ఫలితాలు వెల్లడి దాకా పోలీసులు ప్రతిచోట అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.