మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమాని లైసెన్సు రద్దు చేసేలా చర్యలు చేపట్టాలని, అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాలలో మార్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, రహదారులపై ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలని, జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై గుర్తించిన బ్లాక్ స్పాట్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రహదారులపై భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ రహదారులపై భద్రత మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను జిల్లా