డోన్: బేతంచెర్ల మండలంలో విద్యుత్ షాక్ తో కొండముచ్చు కోతులు మృతి
Dhone, Nandyal | May 3, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని సిమెంట్ నగర్ గ్రామ సమీపాన విద్యుత్ షాక్తో నాలుగు కొండముచ్చు కోతులు మృతి చెందాయి. సిమెంట్ నగర్ దగ్గర్లోని 26 నెంబర్ పోల్ దగ్గర ఈ సంఘటన జరిగింది. దీనివల్ల శనివారం రాత్రి విద్యుత్ సరఫరాలో పలుమార్లు అంతరాయం ఏర్పడిందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. సిమెంట్ నగర్ సబ్ స్టేషన్ నుంచి బేతంచెర్ల మండలానికి విద్యుత్ సరఫరా జరుగుతుందని అన్నారు.