ఇళ్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునే లబ్ధిదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం పూర్తిగా అందేలా చూడాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీఎస్టీ తగ్గించినప్పటికీ పాత ధరలకే సోలార్ ప్యానెల్ విక్రయిస్తున్న వెండార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.