గడివేముల మండలం కొరటమద్దిలోని బంగారమ్మ దేవాలయం అరుగు వద్ద కూర్చున్న ఓ వ్యక్తి ఉన్నట్లుండి మూర్ఛకు గురై పడిపోయాడు. స్థానిక వైద్య సిబ్బంది చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు. మృతుడు కోవెలకుంట్ల మండలం బిజినవేముల గ్రామానికి చెందిన గొల్ల సుబ్బరాయుడు (55)గా గుర్తించారు. మృతదేహాన్ని కుమారుడు సురేంద్రకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.