ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించి జరిమానా విధించిన పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 29, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం పోలీసులు బహిరంగ మద్యం తాగుతున్న వారిని గుర్తించి జరిమానా విధించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో తనిఖీలు చేపట్టిన అధికారులు బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఆ ప్రాంతాలను వారితోనే శుభ్రం చేయించారు. అంతేకాకుండా పోలీసులు వారిని తీవ్రంగా హెచ్చరిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. బహిరంగంగా మద్యం తాగడం చట్టరీత్య నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.