పెద్ద కడబూరు:ఆదోని ప్రత్యేక జిల్లా కోసం పెద్ద కడబూరు మండల సర్వసభ్య సమావేశంలో ప్రత్యేక తీర్మాణం చేయాలని శనివారం సీపీఐ ఆధ్వర్యంలో ఎంపీపీ శ్రీవిద్యకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ పశ్చిమ ప్రాంతాలైన మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా కావాలన్నారు. ఆదోని ప్రత్యేక జిల్లా అయ్యే వరకు జరిగే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.