సంతనూతలపాడు: మద్దిపాడు లో 85 మంది లబ్ధిదారులకు రూ.59.55 లక్షలు విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
మద్దిపాడు మండలంలోని 21 గ్రామాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ.59.55 లక్షలు విలువచేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ... అప్పుచేసి కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకున్న పేద రోగులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా ఇతోదికంగా ఆర్థిక సహకారం అందిస్తున్నారు ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.