శాంతిపురం మండలంలోని మఠం పంచాయతీ గంగా తిమ్మనపల్లి గ్రామస్థులు రోడ్డు వసతి కల్పించాలని శనివారం నిరసన వ్యక్తం చేశారు. కుప్పం-పలమనేరు జాతీయ రహదారి నుంచి ఎం శాంతంపల్లె, గంగతిమ్మన పల్లె గ్రామాలను కలుపుకొని దండికుప్పం వరకు రోడ్డు ఉందన్నారు. ఇది రెవెన్యూ రికార్డులోనూ ఉందని.. గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే తారు రోడ్డు వేశారన్నారు. ఆ సమయంలో గంగతిమ్మనపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తారు రోడ్డు అడ్డుకున్నారన్నారు.