రీ సర్వే తో సమస్యలకు పరిష్కారం :జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
Ongole Urban, Prakasam | May 12, 2026
జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి మంగళవారం ఐదవ విడత రీసర్వే జరుగుతున్న వల్లూరు గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ గ్రామంలో గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చి రైతుల సమక్షంలోనే ఈ-కేవైసీ చేస్తున్నారా అని ఆరా తీశారు. ఆ విధంగానే అధికారులు చేస్తున్నట్లు స్థానిక రైతులు జాయింట్ కలెక్టరుకు తెలిపారు. రీసర్వే ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని రైతులకు ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు. అనంతరం టంగుటూరు తహసీల్దారు కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ సందర్శించారు.