కుప్పం ప్రాంతాన్ని చలిపులి వనికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుండడంతో చలి తీవ్రత అధికమవుతుంది. కుప్పం ప్రాంతం ఊటీని తలపిస్తుండగా ఉదయం 9 గంటలకు అయినా మంచు కురుస్తోంది. ఇక సాయంత్రం నాలుగు గంటలకే చీకటి పడుతుండడంతో చలి తీవ్రత తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.