బనగానపల్లె: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య : బనగానపల్లె ఎంఈఓ స్వరూప
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని బనగానపల్లె ఎంఈవో స్వరూప తెలిపారు. మంగళవారం పట్టణంలోని మండల పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా మిత్ర కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ఉచితంగా యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.