కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు రూ.48,39,970లు విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకున్న పేదలను ఆదుకోవాలని సదుద్దేశంతో సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా నిధులను విడుదల చేస్తూ వారిని ఆదుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు ఆయన సూచించారు.