జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలో పర్య టించారు. ఈ సందర్భంగా తొమ్మిది రేకుల గ్రామంలో త్రిబుల్ ఆర్ రోడ్డు వల్ల భూములు కోల్పోతున్న బాధితులను పరామర్శించారు. రీజనల్ రింగ్ రోడ్డు మార్చి మా భూములు మాకు ఇవ్వండి అంటూ కవితతో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.