అన్నమయ్య జిల్లా గాలివీడు మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ—గత వైసిపి ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా గాలికివేసిందని విమర్శించారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పనిచేస్తూ, రైతులకు సబ్సిడీ ద్వారా అవసరమైన పనిముట్లు, వ్యవసాయ యంత్రాలు సకాలంలో అందించే చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.