నంద్యాల అర్బన్: జర్మనీలో ఉద్యోగానికి ఎంపికైన శ్రవణాన్ని అభినందించిన నంద్యాల ఎంపీ డాక్టర్
Nandyal Urban, Nandyal | Jun 30, 2026
నంద్యాల యువతి చిక్కొండ శ్రావణి జర్మనీలో నర్సింగ్ ఉద్యోగానికి ఎంపికయ్యింది. దీంతో మంగళవారం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆమెను అభినందించారు. పట్టుదల, కృషితో ఈ స్థాయికి చేరుకున్న శ్రావణి మరెందరో యువతకు ఆదర్శంగా నిలవాలని శబరి పేర్కొన్నారు. ఎంపీ అందించిన ప్రోత్సాహానికి శ్రావణి కృతజ్ఞతలు తెలిపారు.