ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో: గ్రీవెన్స్ లో 458 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అఖిల ప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి,ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల నుండి 458 అర్జీలను స్వీకరించారు. 'వన్ మంత్-ఫోర్ విజిట్' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా చేపట్టారు.వచ్చిన అర్జీల్లో ఎక్కువగా 60 శాతం భూ సమస్యలు,రహదారులు, డ్రైనేజీ,వివిధ రకాల పింఛన్లు తదితర సమస్యల గురించి ప్రజలు కలెక్టర్,ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్